దేదీప్యమానంగా వెలిగిపోతోన్న అయోధ్య ఆలయం

Update: 2020-11-13 14:11 GMT

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పర్వ దినాన్ని పురస్కరించుకొని అయోధ్యలో భారీ సంఖ్యలో దీపోత్సవాన్ని నిర్వహించారు. 5 లక్షల 51 వేల ప్రమిదలను వెలిగించారు. దీంతో అయోధ్య ఆలయం దేదీప్యామానంగా వెలిగిపోతోంది. ఈ వేడకల్లో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ పాల్గొన్నారు. రామ్ లల్లా దర్శనం చేసుకొని... దీపాలను వెలిగించారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. వేడకలను కనులారా దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News