క్రిస్మస్‌ను అధికారికంగా చేస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : హరీష్‌రావు

Update: 2020-09-23 14:57 GMT

Harish Rao (File Photo)

దేశంలో క్రిసమస్‌ పండుగను అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పాస్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తుందన్నారు. చర్చిల నిర్మాణం కోసం.. గ్రామ పంచాయితీలు విధిగా అనుమతి ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందన్నారు. దుబ్బాకలో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామన్నారు మంత్రి హరీష్‌


Tags:    

Similar News