KALESHWARAM: కాళేశ్వరంపై హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

తెలంగాణకు జీవధారగా అభివర్ణించిన హరీశ్... దుష్ప్రచారం చేస్తున్నారన్న కేటీఆర్;

Update: 2025-06-08 03:30 GMT

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇది తెలంగాణకు జీవధార అని, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని కాళేశ్వరం ప్రాజెక్టుపై డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి పార్టీ విషయాలు, రాజకీయాలు లేవని ఇది ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాజెక్టు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్ లు, 21 పంప్ హౌజులు, 203 కి.మీ సొరంగాలు, 1531 కి.మీ గ్రావిటి కెనాల్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ అని హరీశ్ వివరించారు. 240 టిఎంసీల నీళ్ల ఉపయోగం మొత్తం మూడు బ్యారేజీలు నిర్మించగా.. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగాయని హరీశ్ తెలిపారు. 85 పియర్స్ ఉన్నాయన్న సీఎం.. సుందిళ్ల బ్యారేజీలో 74 పియర్స్ ఉన్నాయన్నారు. మేడిగడ్డలో 5 పియర్స్ లో 2 పిల్లర్లు కుంగాయని. కేవలం అదొక్కటి చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు పనిఅయిపోయిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు.

"ఇప్పుడంతా నిందలు, దందాలు చందాలే"

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదన్న కేటీఆర్... నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోందని మండిపడ్డారు. ఇదే కాంగ్రెస్‌ పాలన అని తీవ్ర విమర్శలు చేశారు. నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు పాత్ర చాలా కీలకమన్న కేటీఆర్.. కేసీఆర్ వెనుకాల ఉండి ఆ ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేశారని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై నీళ్లు ఇచ్చిన కేసీఆర్ పై అబండాలు వేస్తున్నారని.. అందుకే అందరికి అర్థం అయ్యేలా చెప్పాలని నేను హరీష్ రావుకు చెప్పానని తెలిపారు. నీళ్ల విషయంలో కృష్ణా, గోదావరిలో ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టి చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కాలంతో పోటీపడి కట్టినమని తెలిపారు.

Tags:    

Similar News