హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిర్వహణపై ఆరోపణలు వచ్చినందున ఈనెల 28వ తేదీ వరకు సెలక్షన్ కమిటీని ఎంపిక చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. 2024-26 సంవత్సరాలకు లీగ్ మ్యాచ్ల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను చూసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావుకు అప్పగించింది. గతంలో జస్టిస్ లావు నాగేశ్వర్రావు పర్యవేక్షణలో జరిగినట్లుగానే ఈసారి జస్టిస్ పి.నవీన్రావు ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్లు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక మధ్యంతర ఆదేశాలను జారీ చేశారు. హెచ్సీఏ ఆర్థిక వ్యవహారాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలంటూ సఫిల్గూడ క్రికెట్ అసోసియేషన్ వేసిన పిటిషన్లోని ఆరోపణలకు వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు. తదుపరి విచారణ వరకు సెలక్షన్ కమిటీలను ఎంపిక చేయొద్దన్నారు.
హెచ్సీఏ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్సీఏ అక్రమాల కేసులో దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు అరెస్టవగా.. తాజాగా హెచ్సీఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్రావుకు అప్పగించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) కార్యదర్శి దేవరాజ్ రామచందర్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. ‘‘దేవరాజ్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచాం. అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.