HEAVY RAINS: రెడ్ అలెర్ట్.. తెలంగాణ

నేడు భారీ వర్షాలు

Update: 2025-09-27 07:00 GMT

మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయవ్య, మధ్య బంగాళాఖాతం సమీపంలో పూరీ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా 60కి.మీ దూరంలో, గోపాల్‌పూర్‌నకు తూర్పుదిశలో కేంద్రీకృతమైంది. క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తోంది. పూరీ, కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, అన్ని జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో 12 నుంచి 20 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో 5-10 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. లో­త­ట్టు ప్రాం­తా­ల­ను ఎప్ప­టి­క­ప్పు­డు పర్య­వే­క్షిం­చా­ల­ని తె­లి­పా­రు. అన్ని వి­భా­గాల అధి­కా­రు­లు మరింత అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని, నీరు ని­లి­చే ప్రాం­తా­ల­ను గు­ర్తిం­చి ముం­ద­స్తు చర్య­లు చే­ప­ట్టా­ల­ని ము­ఖ్య­మం­త్రి ఆదే­శిం­చా­రు. హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న మూసీ

వి­కా­రా­బా­ద్‌ జి­ల్లా­లో మూసీ నది ప్ర­మా­ద­కర స్థా­యి­లో ప్ర­వ­హి­స్తు­న్న­ది. శం­క­ర్‌­ప­ల్లి­లో కు­రు­స్తు­న్న భారీ వర్షాల కా­ర­ణం­గా పలు ప్రాం­తా­ల్లో రా­క­పో­క­లు ని­లి­చా­యి. టం­గు­టూ­రు-మో­కిల రో­డ్డు­ను సు­ర­క్షత కా­ర­ణం­గా అధి­కా­రు­లు మూ­సి­వే­శా­రు. అలా­గే, అం­బ­ర్‌­పేట-ము­సా­రం­బా­గ్‌ బ్రి­డ్జీ పై రా­క­పో­క­లు ని­లి­పి­వే­య­డం జరి­గిం­ది. నగ­రం­లో కు­రు­స్తు­న్న భారీ వర్షాల కా­ర­ణం­గా ఉస్మా­న్‌­సా­గ­ర్‌ నది నిం­డి­పో­యిం­ది. ఆ కా­ర­ణం­గా ఉస్మా­న్‌­సా­గ­ర్‌ నుం­చి ది­గువ ప్రాం­తా­ల­కు నీరు వి­డు­దల చే­స్తు­న్నా­రు. అం­బ­ర్‌­పేట ము­సా­రం­బా­గ్‌ బ్రి­డ్జీ పై వరద నీరు క్ర­మం­గా పె­రు­గు­తోం­ది. ప్ర­జల భద్రత కోసం బ్రి­డ్జీ­పై బా­రి­కే­డ్ల­ను ఏర్పా­టు చేసి వా­హ­నాల రా­క­పో­క­ల­ను ని­లి­పి­వే­శా­రు.

తెలంగాణ‌కు రెడ్ అల‌ర్ట్

వా­యు­వ్య మధ్య బం­గా­ళా­ఖా­తం సమీ­పం­లో వా­యు­గుం­డం కేం­ద్రీ­కృ­త­మైం­ది. ఇది పూరీ, కళిం­గ­ప­ట్నంల మధ్య తీరం దాటే అవ­కా­శం ఉంది. దీని ప్ర­భా­వం­తో తె­లం­గాణ వ్యా­ప్తం­గా రాగల 24 గం­ట­ల్లో భారీ నుం­చి అతి­భా­రీ వర్షా­లు కు­రి­సే అవ­కా­శం ఉం­ద­ని వా­తా­వ­రణ శాఖ రెడ్ అల­ర్ట్ ప్ర­క­టిం­చిం­ది. ఉత్తర, దక్షిణ కో­స్తా జి­ల్లా­ల­కు కూడా ఆరెం­జ్ అల­ర్ట్ జారీ చే­సిం­ది. ప్ర­జ­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని సూ­చిం­చా­రు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News