Huzurabad By Election : రేపటితో ముగియనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం..!
Huzurabad By Election : హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. బరిలో 30 మంది అభ్యర్ధులు ఉన్నారు.
Huzurabad By Election : హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. బరిలో 30 మంది అభ్యర్ధులు ఉన్నారు. అన్నీ తానై ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి హరీష్రావు. ఐదు నెలలుగా హుజురాబాద్లో మకాం వేశారు మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్. దీంతో హోరాహోరీగా టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం సాగుతోంది. బీజేపీ తరపున ప్రచారంలో మంత్రి కిషన్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున సీనియర్ నేతలు తరలివచ్చారు. రేపు మరోసారి ప్రచారానికి రానున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్గా హుజురాబాద్ బైపోల్ను భావిస్తున్నాయి పార్టీలు.