గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. షాహినాయత్ గంజ్ పీఎస్లో ఎస్ఐ రాఘవేందర్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. శ్రీరామ శోభాయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో .. ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ధర్మం గురించి మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కొట్టేసిన పీడీ యాక్ట్ కేసును మళ్లీ తెరిచి జైలుకు పంపే కుట్ర చేస్తున్నారన్నారు. శోభాయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనకు బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయని మాట్లాడితే.. పోలీసులు స్పందించారా? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్