telangana : తెలంగాణలో వాడవాడలా జాతీయ జెండా రెపరెపలు
అంబరాన్నింటిన మువ్వన్నెల సంబురాలు;
తెలంగాణవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఇక శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల్లో కూడా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండ spr స్కూల్లో కూడా వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థులు పలు ప్రదర్శనలు చేశారు.
ఇక వివిధ జిల్లాల్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కొత్తగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మహబూబ్నగర్లో జూపల్లి కృష్ణారావు, ఖిలావరంగల్ కోటలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, హనుమకొండలో కొండా సురేఖ, ములుగులో సీతక్క, సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్ జాతీయ జెండా ఎగుర వేశారు. మిగతా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎస్పీలు జెండాలను ఎగురవేశారు.