ఫిబ్రవరి 1 నుంచి కాలేజీకి.. కొత్త రూల్..

ఒకరోజు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధిస్తే, మరుసటి రోజు రెండవ సంవత్సరం

Update: 2021-01-27 09:28 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1నుంచి ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభం అవనున్నాయి. అయితే ఇంటర్ తరగతుల నిర్వహణలో గతంలో జారీ చేసిన ఆదేశాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకు ముందు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉదయం 9:30 నుంచి సాయింత్రం 4 గంటల వరకు కాలేజీలు నడుపుకోవచ్చు అని పేర్కొన్నారు. ఉదయం ఒక షిప్ట్, సాయింత్రం ఒక షిప్ట్ నడుపాలని సూచించారు. అయితే ఈ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి ఇంటర్ బోర్డు మళ్లీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఒకరోజు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధిస్తే, మరుసటి రోజు రెండవ సంవత్సరం విద్యార్థులకు పాఠాలు బోధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను వారు చదువుతున్న కళాశాలలోనే నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. 

Tags:    

Similar News