గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు..

రాజ్‌భవన్‌లో జరిగిన వీసీల సమావేశంలో గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-26 10:15 GMT

రాజ్‌భవన్‌లో జరిగిన వీసీల సమావేశంలో గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంట్రవర్సీ చేయాలని ఫైట్ చేయాలని తన ఉద్దేశం కాదన్నారు. ఒక కాటలిస్ట్‌గా పని చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. యువతను దృష్టిలో పెట్టుకుని బిల్లులు తిరస్కరించడం, అమోదించడం జరిగిందని చెప్పారు.

ప్రభుత్వంతో ఉన్న సమస్యల వల్ల విద్యార్థులతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నానని స్పష్టంచేశారు. యూనివర్శిటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆరా తీసిన గవర్నర్ విద్యార్థుల సమస్యలు తీర్చాలన్నారు. మంచి ఫ్రొఫెసర్లు, టాలెంట్ కలిగిన విద్యార్థులు ఉన్నా ర్యాంకింగ్‌లో ఎందుకు వెనుకబడుతున్నామని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి నాణ్యమైన విద్య అవసరమన్న గవర్నర్ అన్ని వర్శిటీల్లో క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు.

Tags:    

Similar News