Ka Paul : సిరిసిల్ల పర్యటనలో నాపై దాడి చేసింది కేటీఆర్ మనిషే : కేఏ పాల్
Ka Paul : సిరిసిల్ల పర్యటనలో తనపై దాడి చేసింది మంత్రి కేటీఆర్ మనిషేనని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.;
Ka Paul : సిరిసిల్ల పర్యటనలో తనపై దాడి చేసింది మంత్రి కేటీఆర్ మనిషేనని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తెలంగాణ చరిత్రలో నిన్న బ్లాక్ డే అన్నారు. రైతులు పిలిస్తే వెళ్లానని.. అంతలో టీఆర్ఎస్ కార్యకర్త వచ్చి దాడి చేశాడని తెలిపారు. అతను కేటీఆర్ మనిషన్నారు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తనను కొట్టిన వ్యక్తితో పోలీసులు బ్లూటూత్లో మాట్లాడారని అన్నారు. దాడి ఘటనపై డీజీపీని కలుస్తాంటే అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు రైతు ద్రోహులు అంటూ విమర్శించారు.