Telangana : కాంగ్రెస్‌లోకి కవిత..? మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Update: 2025-07-15 12:15 GMT

కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి - కవితకు మధ్య అనధికారిక ఒప్పందం నడుస్తోందన్నారు. ఇటీవల ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు.. కవితకు సైతం ఆ అవకాశం వచ్చిందని.. ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలే చెప్పాలని ప్రశ్నించారు. అగ్రకులాల వాళ్లంతా ఏకమై బీసీలపై దాడి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీసీలంతా ఏకమైతే అగ్రకులాలు పత్తా లేకుండా పోతాయని చెప్పారు.

బీసీలందరూ ఏకమై రాజకీయ పార్టీగా ముందుకొస్తామని మల్లన్న తెలిపారు. రాష్ట్రంలో బీసీలు అధికారాన్ని చేపట్టడం ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో బీసీలంతా ఒకవైపు... కల్వకుంట్ల కుటుంబం మరోవైపు అని అన్నారు. తన మీద మనుషులను ఉసిగొలిపి తనపై కవిత హత్యాయత్నం చేశారని మల్లన్న ఆరోపించారు. తన మీద, తన కార్యాలయం మీద దాడి చేసిన సుజిత్ రావు కవిత బంధువేనని చెప్పారు. తనపై జరిగిన దాడిని బీఆర్ఎస్ నేతలు కూడా స్వాగతించలేదని మల్లన్న చెప్పారు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి కవితకు సపోర్ట్‌గా నిలిచారని విమర్శించారు.

Tags:    

Similar News