phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై పోలీసుల దృష్టి;

Update: 2025-06-29 03:30 GMT

తె­లు­గు రా­ష్ట్రా­ల్లో సం­చ­ల­నం సృ­ష్టి­స్తు­న్న ఫోన్ ట్యా­పిం­గ్ కేసు దర్యా­ప్తు­లో కీలక పరి­ణా­మా­లు వె­లు­గు­లో­కి వస్తు­న్నా­యి. 2022 ఎమ్మె­ల్యేల కొ­ను­గో­లు కే­సు­పై సిట్ అధి­కా­రు­లు ఫో­క­స్ పె­ట్టా­రు. గతం­లో ఎమ్మె­ల్యేల కొ­ను­గో­లు వ్య­వ­హా­రం­లో మాజీ సీఎం కే­సీ­ఆ­ర్ ఆడి­యో­లు రి­లీ­జ్ చే­య­డం­తో దా­ని­పై సిట్ బృం­దం దర్యా­ప్తు చే­స్తోం­ది. కాగా.. ఫోన్ ట్యా­పిం­గ్ ద్వా­రా­నే కా­ల్స్ రి­కా­ర్డ్ చే­సి­న­ట్లు సిట్ ప్రా­థ­మిక అం­చ­నా వే­స్తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ఓవై­పు ఈ కే­సు­లో నిం­ది­తు­లు­గా ఉన్న పో­లీ­సు అధి­కా­రు­ల­ను వి­చా­రి­స్తూ­నే…. మరో­వై­పు బా­ధి­తుల వి­వ­రా­ల­ను కూడా సిట్ సే­క­రి­స్తోం­ది. ఇం­దు­లో సినీ, రా­జ­కీయ, మీ­డి­యా, వ్యా­పా­ర­వే­త­ల­తో పాటు పలు­వు­రు ప్ర­ము­ఖ­లు ఉన్న­ట్లు గు­ర్తిం­చా­రు. పలు­వు­రు నే­త­ల­కు సిట్ నో­టీ­సు­లు జారీ చే­సిం­ది. వీరి నుం­చి స్టే­ట్మెం­ట్ల­ను రి­కా­ర్డు చే­సిం­ది.

నిందితులెందరు..?

600కుపైగా బాధితులతో కూడిన ఓ జాబితాను కూడా సిట్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా నోటీసులు జారీ చేస్తూ విచారిస్తోంది. వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది. త్వరలోనే మరికొంతమంది రాజకీయ నాయకుల నుంచి వాంగ్మూలాలను సేకరించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువ మంది నేతలు ఉన్నట్లు తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావ్ తో కూడిన టీమ్ నిరంతరం పని చేసినట్లు సిట్ గుర్తించింది. దాదాపు 4 వేలకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ వర్గాల మేరకు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిక సంఖ్యలో ఫోన్లు ట్యాప్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. సిట్ విచారణతో పాటు బయటికి వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే…. ఈ కేసులో బాధితుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారితోనే నిందితుల సంఖ్య ఆగిపోతుందా…? లేక మరికొంత మంది పేర్లు తెరపైకి వస్తాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News