మిసెస్ ఇండియా రన్నరప్‌గా ఖమ్మం గృహిణి ఫర్హా..!

గుజరాత్‌లో ఈనెల 21న జరిగిన వీపీఆర్ మిసెస్ ఇండియా సీజన్‌-2లో 32ఏళ్ల మహమ్మద్ ఫర్హా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.

Update: 2021-03-07 07:00 GMT

మిసెస్ ఇండియా పోటీల్లో ఖమ్మం గృహిణి సత్తా చాటింది. గుజరాత్‌లో ఈనెల 21న జరిగిన వీపీఆర్ మిసెస్ ఇండియా సీజన్‌-2లో 32ఏళ్ల మహమ్మద్ ఫర్హా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. దేశవ్యాప్తంగా 912 మంది వివాహితలు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకోగా.. 41 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి మహమ్మద్ ఫర్హా మాత్రమే ఎంపికయ్యారు. భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధించానని ఆమె తెలిపారు.

Tags:    

Similar News