Bio Asia 2022: బయో ఏసియా సదస్సులో ఆసక్తికర సన్నివేశం.. బిల్‌గేట్స్‌తో కేటీఆర్..

Bio Asia 2022: వచ్చువల్‌గా జరుగుతున్న 19వ ఎడిషన్‌ బయో ఏసియా సదస్సులో ఆసక్తికర సన్నివేశం కనిపించింది.

Update: 2022-02-24 16:21 GMT

Bio Asia 2022: వచ్చువల్‌గా జరుగుతున్న 19వ ఎడిషన్‌ బయో ఏసియా సదస్సులో ఆసక్తికర సన్నివేశం కనిపించింది.. మంత్రి కేటీఆర్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మధ్య జరిగిన చిట్‌ చాట్‌ ఆసక్తిని రేపింది.. లైఫ్‌ సైన్సెస్‌ - ఆరోగ్య రంగంలో కోవిడ్‌ సవాళ్లపై చర్చలో భాగంగా బిల్‌గేట్స్‌తో ఆయా అంశాలపై మంత్రి కేటీఆర్‌ చర్చించారు.. కరోనా మహమ్మారితో రెండేళ్ల ప్రపంచ అనుభవాలతోపాటు ఆరోగ్య పరిరక్షణలో మారుతున్న పరిణామాలకు సంబంధించిన అంశాలపై ఇద్దరూ చర్చించారు.. చివర్లో హైదరాబాద్‌ పర్యటన అంశం కూడా చర్చకు వచ్చింది.. ఈసారి ఒక అద్భుతమైన హైదరాబాద్‌ నగరం మీకు ఆహ్వానం పలుకుతుందంటూ కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News