హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మూసీ నదిపైనా ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని చేపడతామని వెల్లడించారు. కోకాపేటలో జలమండలి ఏర్పాటు చేసిన STPని కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హైదరాబాద్లో వంద శాతం సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తామన్నారు. STPల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలని కోరారు. వచ్చే వారంలో దుర్గంచెరువు STPని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక.. రద్దీ మేరకు సర్వీస్ రోడ్లను విస్తరించాలని సీఎం కేసీఆర్ చెప్పారని.. ప్రజల విజ్ఞప్తి మేరకు ORRపై 120 కిలోమీటర్ల వరకు వాహనాల స్పీడ్ పెంచామని అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్లు కేటాయించామని.. BHEL నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరిస్తామని చెప్పారు.