KTR: కాంగ్రెస్‌కు కాలం చెల్లింది: కేటీఆర్

కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్

Update: 2025-12-16 05:00 GMT

రెం­డో దశ పం­చా­య­తీ ఎన్ని­కల ఫలి­తా­లు ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి అరా­చక పా­ల­న­కు చెం­ప­పె­ట్టు లాం­టి­వ­ని బీ­ఆ­ర్ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్ తీ­వ్ర­స్థా­యి­లో వి­మ­ర్శిం­చా­రు. కాం­గ్రె­స్ పా­ర్టీ అడ్డ­దా­రి­లో గద్దె­నె­క్కిం­ద­ని, ఇప్పు­డు ఆ పా­ర్టీ­కి రా­ష్ట్రం­లో కాలం చె­ల్లిం­ద­ని పల్లె ప్ర­జ­లు తమ ఓటు ద్వా­రా స్ప­ష్ట­మైన తీ­ర్పు ఇచ్చా­ర­ని పే­ర్కొ­న్నా­రు. రెం­డో దశ పం­చా­య­తీ ఎన్ని­క­ల్లో అద్వి­తీయ ఫలి­తా­లు సా­ధిం­చిన బీ­ఆ­ర్ఎ­స్ శ్రే­ణు­ల­కు కే­టీ­ఆ­ర్ హృ­ద­య­పూ­ర్వక శు­భా­కాం­క్ష­లు తె­లి­పా­రు. ప్ర­భు­త్వ పె­ద్ద­లు ప్రా­తి­ని­ధ్యం వహి­స్తు­న్న ని­యో­జ­క­వ­ర్గా­ల్లో­నూ అధి­కార పా­ర్టీ కో­ట­లు బీ­ట­లు వా­ర­డం రా­ష్ట్రం­లో మా­రు­తు­న్న రా­జ­కీయ ము­ఖ­చి­త్రా­ని­కి ని­ద­ర్శ­న­మ­ని పే­ర్కొ­న్నా­రు. ము­ఖ్యం­గా కాం­గ్రె­స్ మం­త్రు­లు, ఎమ్మె­ల్యేల ని­యో­జ­క­వ­ర్గా­ల్లో సైతం బీ­ఆ­ర్ఎ­స్ బల­ప­రి­చిన అభ్య­ర్థు­లు సత్తా చా­టా­ర­ని, ఇం­దు­కు కృషి చే­సిన పా­ర్టీ నే­త­లు, కా­ర్య­క­ర్త­ల­కు ప్ర­త్యేక అభి­నం­ద­న­లు తె­లి­పా­రు. రే­వం­త్ పా­ల­నా వై­ఫ­ల్యా­ల­పై ప్ర­జ­లు ఆగ్ర­హం­గా ఉన్నా­ర­న్నా­రు.

మీరు పిరికి పందలు: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతి మించుతోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా సోమార్‌పేట్ గ్రామంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బిట్ల బాలరాజుపై దాడిని కేటీఆర్ ఖండించారు. ఈ అమానుష ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. భౌతిక దాడులకు తెగబడటం పిరికిపంద చర్య అని మండిపడ్డారు.

ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి ఇంటిపై దాడి

సర్పం­చ్ ఎన్ని­క­ల్లో ఓడిన అభ్య­ర్థి ఇం­టి­పై రా­జ­కీయ కక్ష­ల­తో ట్రా­క్ట­ర్ తో దాడి చే­య­గా నలు­గు­రు మహి­ళ­ల­కు తీ­వ్ర గా­యా­ల­య్యా­యి. అం­దు­లో ఇద్ద­రు పరి­స్థి­తి వి­ష­మం­గా ఉం­డ­డం­తో హై­ద­రా­బా­ద్ కు తర­లిం­చా­రు. గ్రా­మ­స్తు­లు తె­లి­పిన వి­వ­రాల ప్ర­కా­రం.. కా­మా­రె­డ్డి జి­ల్లా ఎల్లా­రె­డ్డి మం­డ­లం­లో­ని సో­మా­ర్​­పే­ట్​ గ్రా­మం­లో ఇటీ­వల జరి­గిన సర్పం­చ్​ ఎన్ని­క­ల్లో ఓ పా­ర్టీ మద్ద­తు­దా­రు­డు ఓడి­పో­యా­డు. అయి­తే తాము గె­లి­చి­న­ప్ప­టి­కీ గతం­లో తమను ఇబ్బం­దు­లు పె­ట్టా­డ­నే కక్ష­తో ప్ర­త్య­ర్థి వర్గం గ్రా­మం­లో­ని ఓడిన అభ్య­ర్థి బి­ట్ల బా­ల­రా­జు ఇం­టి­పై ట్రా­క్ట­ర్ తో దా­డి­కి పా­ల్ప­డ్డా­ర­ని గ్రా­మ­స్థు­లు పే­ర్కొ­న్నా­రు. ట్రా­క్ట­ర్​­తో ఆయన ఇం­టి­పై­కి దా­డి­కి వె­ళ్ల­గా బా­ల­రా­జు తప్పిం­చు­కు­న్నా­డ­ని వారు తె­లి­పా­రు. ట్రా­క్ట­ర్ తో ఢీ­కొ­న్న ప్ర­మా­దం­లో గంజి భా­ర­తి, తోట శారద, బా­ల­మ­ణి, సత్య­వ్వ లకు తీ­వ్ర గా­యా­ల­య్యా­యి. వీ­రి­లో గంజి భా­ర­తి, తోట శారద పరి­స్థి­తి వి­ష­మం­గా ఉం­డ­డం­తో చి­కి­త్స ని­మి­త్తం హై­ద­రా­బా­ద్​­కు తర­లిం­చా­రు. బా­ల­మ­ణి, సత్య­వ్వ­ల­ను ఎల్లా­రె­డ్డి పట్ట­ణం­లో­ని ప్ర­భు­త్వ ఆస్ప­త్రి­లో చే­ర్పిం­చా­రు. రా­జ­కీయ కక్ష­ల­తో­నే ఓడిన అభ్య­ర్థి ఇంటి పై దా­డి­కి పా­ల్ప­డ్డా­ర­ని ఆరో­పి­స్తూ బా­ధిత వర్గా­ని­కి మద్ద­తు తె­లు­పు­తూ పలు­వు­రు బీ­ఆ­ర్​ఎ­స్​ నా­య­కు­లు సభ్యు­లు గ్రా­మ­స్తు­ల­తో కలి­సి ఎల్లా­రె­డ్డి _ ని­జాం­సా­గ­ర్​ ప్ర­ధాన రహ­దా­రి­పై బై­ఠా­యిం­చి రా­స్తా­రో­కో చే­శా­రు. దా­డి­కి పా­ల్ప­డిన వ్య­క్తి­ని, ఆయ­న­ను ప్రో­త్స­హిం­చిన వ్య­క్తు­ల­పై వెం­ట­నే చర్య­లు తీ­సు­కో­వా­ల­ని డి­మాం­డ్​ చే­శా­రు.

Tags:    

Similar News