దుబ్బాక ఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ ప్రలోభాలు పెంచిందని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు మద్యం, డబ్బులు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక నియోజవర్గంలోని పలు గ్రామాల్లో రఘునందన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపు విమర్శలు గుప్పించారు. నాయకులు, కార్యకర్తలే బీజేపీ బలం అని అన్నారు.