Mahaboobabad: పేదల గుడిసెల తొలగింపు.. భగ్గుమన్న బాధితులు

మహబూబాబాద్‌ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదల గుడిసెలను అధికారులు తొలగించడంపై బాధితులు భగ్గుమన్నారు;

Update: 2023-05-24 05:30 GMT

మహబూబాబాద్‌ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదల గుడిసెలను అధికారులు తొలగించడంపై బాధితులు భగ్గుమన్నారు. పోలీసు బలగాలతో వచ్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కొద్దిసేపు ఆ ప్రాంతం రణరంగంగా మారింది. పోలీసులు వెనక్కి వెళ్లాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. మరోవైపు పోలీసులు, అధికారుల చర్యలకు వ్యతిరేకంగా ఓ బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ గుడిసెలను తొలగించొద్దంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News