Metro Trains : ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. రేపట్నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యం పెంపు..!

Metro Trains : నగర ప్రయాణికులకి హైదరాబాదు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు.

Update: 2021-05-31 11:22 GMT

Metro Trains : నగర ప్రయాణికులకి హైదరాబాదు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. రేప‌ట్నుంచి ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు ప్రయాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. లాక్ డౌన్ సడలింపులో భాగంగా మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. చివ‌రి రైలు ఒంటి గంట‌కు బ‌య‌ల్దేరి 2 గంట‌ల వ‌ర‌కు చివ‌రి స్టేష‌న్‌కు చేరుకోనుంది. అన్ని ర‌కాల ప్రజా ర‌వాణాకు మ‌రో గంట అద‌నంగా వెసులుబాటు క‌ల్పించారు. కాగా కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News