Harish Rao : రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు : హరీష్‌రావు

Harish Rao : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు సంపూర్ణ బలముందని మంత్రి హరీష్‌రావు అన్నారు.

Update: 2021-11-23 12:10 GMT

Harish Rao : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు సంపూర్ణ బలముందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎంతమంది నామినేషన్లు వేసినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మెదక్ జిల్లాలో పర్యటించిన హరీష్‌రావు.. కేంద్రం, రాష్ట్ర బీజేపీపైనా విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రైతులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్ని రకాల ధరలను పెంచి అన్నదాతల నడ్డి విరుస్తున్న కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుకు రైతుల గురించే మాట్లాడే అర్హత లేదని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.

Tags:    

Similar News