నేతన్నల నోట్లో మట్టి కొట్టింది బీజేపీయే : మంత్రి హరీష్రావు
ఉన్న పథకాలను ఊడగొట్టి.. నేతన్నల నోట్లో మట్టి కొట్టింది బీజేపీయేనని నిప్పులు చెరిగారు మంత్రి హరీష్రావు. త్రిఫ్ట్ పథకం బాగుందంటూ నేతన్నల నుంచి ప్రశంసలు వస్తున్నాయన్నారు.;
ఉన్న పథకాలను ఊడగొట్టి.. నేతన్నల నోట్లో మట్టి కొట్టింది బీజేపీయేనని నిప్పులు చెరిగారు మంత్రి హరీష్రావు. త్రిఫ్ట్ పథకం బాగుందంటూ నేతన్నల నుంచి ప్రశంసలు వస్తున్నాయన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయపల్లిలో పర్యటించిన ఆయన.. చేనేత కార్మికులకు చెక్కులు అందజేశారు. ఇప్పటికే త్రిఫ్ట్ పథకం కింద 30 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఢిల్లీలో ఉన్న ఆలిండియా హ్యాండ్లూమ్స్ బోర్డును రద్దు చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు.