కోదాడలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటన!

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. 24వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి జగదీష్ ప్రారంభించారు.

Update: 2021-02-03 14:13 GMT

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. 24వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి జగదీష్ ప్రారంభించారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ తలపెట్టిన ప్రజల కోసం- ప్రగతి కోసం కార్యక్రమంలో భాగంగా మంత్రి పర్యటించారు. వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ... స్థానికుల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణ, మున్సిపల్ చైర్మన్‌ వనపర్తి శిరీష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన 33 కేవీ విద్యుత్ తీగలను తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. ఆ తర్వాత.. కోదాడ పెద్ద చెరువు ట్యాండ్ బండ్ నిర్మాణ పనులు పరిశీలించారు.

Tags:    

Similar News