KTR : దళితబంధు పథకంతో దళితుల దశ, దిశ మారాలి : మంత్రి కేటీఆర్

KTR : శతాబ్దాలుగా వివక్షకు గురవుతున్న దళితులు... సాధికారత, స్వావలంబన సాధించేందుకే పథకం తెచ్చామన్నారు.

Update: 2022-05-04 15:00 GMT

KTR : రాజకీయ లబ్ధి కోసమో, ఓట్ల కోసమే దళితబంధు ప్రవేశపెట్టలేదన్నారు మంత్రి కేటీఆర్. శతాబ్దాలుగా వివక్షకు గురవుతున్న దళితులు... సాధికారత, స్వావలంబన సాధించేందుకే పథకం తెచ్చామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు కేటీఆర్. ఎల్లారెడ్డిపేటలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు నిర్మించుకోనున్న రా రైస్ మిల్లుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. దళితబంధు పథకంతో దళితుల దశ, దిశ మారాలని ఆకాంక్షించారు కేటీఆర్.

Tags:    

Similar News