Minister KTR : భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్

Minister KTR : పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చిన భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు.

Update: 2022-04-06 05:58 GMT

Minister KTR : పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చిన భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపిని ఆదేశించారు. ముషీరాబాద్‌లో పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన కార్పొరేటర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కల్గిస్తే సహించేదిలేదన్నారు. భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్‌ ముషీరాబాద్‌ పోలీసులపై విరుచుకుపడ్డారు. నెలరోజుల వరకు కనిపించవద్దంటూ కార్పొరేటర్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. కేటీఆర్ ఆదేశాలతో కార్పొరేటర్ గౌసుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద ముషీరాబాద్‌ పోలీసులు కేసునమోదు చేశారు.

Tags:    

Similar News