ప్రభుత్వ ఉద్యోగులకు మిషన్‌ భగీరథ వాటర్‌ బాటిల్స్‌!

తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్నీ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Update: 2021-01-20 12:30 GMT

తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్నీ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మిషన్ భగీరథ నుంచి తాగునీటి బాటిళ్లను తీసుకురావడం సీఎం కేసీఆర్ విజయం అని, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ బాటిళ్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉచితంగానే ఈ బాటిళ్లు పంపిణీ చేస్తామన్నారు. 


Tags:    

Similar News