కష్టపడి పని చేసే యాత్‌ కాంగ్రెస్‌ నేతలకే ఎమ్మెల్యే టికెట్లు : రేవంత్‌

కష్టపడి పని చేసే యాత్‌ కాంగ్రెస్‌ నేతలకే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

Update: 2021-08-21 10:39 GMT

కష్టపడి పని చేసే యాత్‌ కాంగ్రెస్‌ నేతలకే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రగతి భవన్‌లో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి సమరానికి యూత్‌ కాంగ్రెస్‌ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో యూత్‌ కాంగ్రెస్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కమ్‌ ఠాగూర్‌ హాజరయ్యారు. రానున్న 26నెలలు కాంగ్రెస్‌కు ఛాలెంజ్‌ అని మాణిక్కమ్‌ ఠాగూర్‌ అన్నారు. సమష్టిగా పోరాడితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన, బీజేపీ మతతత్వానికి చరమ గీతం పాడాలని యూత్‌ కాంగ్రెస్‌ నేతలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News