హైదరాబాద్లో మళ్లీ పట్టాలెక్కిన MMTS రైళ్లు..!
MMTS trains : భాగ్యనగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయి. 15 నెలల సుదీర్ఘ విరామం తరువాత రైళ్లు పరుగులు తీస్తున్నాయి.;
MMTS trains : భాగ్యనగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయి. 15 నెలల సుదీర్ఘ విరామం తరువాత రైళ్లు పరుగులు తీస్తున్నాయి. గతేడాది కరోనాతో నిలిచిపోయిన రైళ్ల సేవలు తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభించారు. మొత్తం 121 ఎంఎంటీఎస్ సర్వీస్లుకు గాను.. 10 సర్వీసులన ప్రారంభించారు. లైఫ్ లైన్ హైదరాబాద్ ఎంఎంటీఎస్ పేరుతో.... లింగంపల్లి రైల్వే స్టేషన్లో రైలును పూలతో అలంకరించి ప్రారంభించారు. ఇప్పుడు మొదటి విడతలో 10 సర్వీసులను అందుబాటులో ఉంచగా... మిగిలిన సర్వీసులను దశల వారీగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో ఎంఎంటీఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నిత్యం 121 సర్వీసులతో.. లక్ష 65 వేల మందిని గమ్య స్థానాలకు చేరుస్తుంది. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సర్వీసులు.. కొన్ని గంటలు తప్ప.. ఇంత సుదీర్ఘ కాలం ఆగిన దాఖలాలు లేవు. గత ఏడాది కరోనా కారణంగా ఆగిపోయిన ఎంఎంటీఎస్ సర్వీసులను... తిరిగి ప్రారంభించింది రైల్వే బోర్డు.