బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

Update: 2020-12-02 10:37 GMT

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. గ్రేటర్ ఎన్నికలు జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు పది నిమిషాల పాటు.. ఎన్నికలపై, పార్టీ పరిస్థితులపై ముచ్చటించారు. కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని మోదీ అభినందించారు. ఇలాగే ధైర్యంగా ముందుకు సాగాలని.. అన్నివిధాలా అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News