పెద్దపులికోసం దహేగాం అడవుల్లో అన్వేషణ

ఆదిలాబాద్ జిల్లాలో ఒక వ్యక్తిపై దాడిచేసిన చంపిన పెద్దపులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు అధికారులు . పులి దాడిచేసిన ప్రదేశం నుంచి 5 కిలోమీటర్లమేర..;

Update: 2020-11-14 06:31 GMT

ఆదిలాబాద్ జిల్లాలో ఒక వ్యక్తిపై దాడిచేసిన చంపిన పెద్దపులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు అధికారులు . పులి దాడిచేసిన ప్రదేశం నుంచి 5 కిలోమీటర్లమేర చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు బోన్లు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కన్జర్వేషన్ ఆఫ్‌ ఫారెస్టు అధికారి వినోద్ కుమార్ వెల్లడించారు. 37మందితో 7 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు చేప్పారు. . స్థానిక ప్రాథమిక పాఠశాలలో క్యాంప్ ఏర్పాటుచేసి 12 బృందాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరు భయాందోళకు గురికావొద్దని తెలిపారు...

పెద్దపులికోసం దహేగాం అడవుల్లో ఒక వైపు అన్వేషన కొనసాగుతుండగానే... మరోవైపు జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఒంటరిగా వ్యవసాయ బావులవద్దకు వెళ్లాలంటే జంకుతున్నారు. బె.జ్జూరు మండలంలో పెద్దపులి సంచారిస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అక్కడికిచేరుకున్నారు. ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంలో పులి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులుహెచ్చరించారు.

రెండురోజులక్రితం కొమురంభీం జిల్లా దాహెగాం మండలంలోని దిగాడలో పశువులు మేపేందుకు వెళ్లిన విజ్ఞేశ్వర్‌ అనే యువకుడిపై పెద్దపులి దాడిచేసి చంపేసింది. అతన్ని నోటకరుచుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి తినేసింది. అప్పటి నుంచి పెద్దపులికోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటికి జాడ లభించడలేదు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళనకుగురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని బతుకులు ఈడుస్తున్నారు.  

Tags:    

Similar News