పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు రైతాంగ చారిత్రలో సువర్ణాధ్యాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనేక ఏళ్లుగా నిజామా బాద్ జిల్లా రైతాంగం డిమాండ్ నెరవేర్చుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ 29 తేదీన నిజామాబాద్లో లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పసుపు రైతులు ఆకాంక్ష పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశారు. రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. అనేక పార్టీలు హామీలు ఇచ్చారు. కానీ ఎంపీ అరవింద్ పట్టువదలని కృషి, ప్రధాని మోదీ ఆశీస్సులతో పసుపు బోర్డు ఏర్పాటు చేశారనీ చెప్పారు.
పసుపు బోర్డు సంబంధించి కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాద్ ను ఎంపిక చేయడం గొప్ప నిర్ణయం. పసుపు ఎక్కువ ఉత్పత్తి చేసే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో బోర్డు ఏర్పాటు కోసం అడిగారు. కానీ ప్రధాని మాత్రం నిజామా బాద్లోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జిల్లా వాసులకు బహుంతిగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు సమస్యల మీద పోరాటం గొప్పది. కలిసికట్టుగా సమ స్యల సాధన కోసం ఉద్యమించిన చరిత్ర నిజామాబాద్ రైతు లది అని అన్నారు. రైతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రైతులతో నిజామాబాద్ పట్టణం 29న మమేకం కానుంది. కార్యాలయం ప్రారంభం, లోగో ఆవిష్కరణ తర్వాత రైతుల సభ ఉద్దేశించి ప్రసంగం ఉంటుందన్నారు. రైతులు రాజకీ యాలకు అతీతంగా హాజరుకావాలనీ కిషన్ రెడ్డి పిలుపుని చ్చారు. రైతులకు హామీ ఇచ్చాము. నెరవేర్చుకున్నాము. భారత దేశానికి పేరు తెచ్చే విధంగా బోర్డు పనితీరు ఉండేలా అందరు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్నారు.