తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్లో నెలలోపు ఓపీ సేవలు ప్రారంభిస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి. ఆయన ఇవాళ ఎయిమ్స్ను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో .. దాదాపు వెయ్యి కోట్ల నిధులతో ఎయిమ్స్ నిర్మించినట్లు తెలిపారు. కోవిడ్తో పాటు క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడ రీసెర్చ్ పాటు మెరుగైనా వైద్యం సహాయం అందుతుందన్నారు. ఎయిమ్స్ వెబ్సైట్ను ప్రారంభించారు కిషన్రెడ్డి. ప్రధాని ఆదేశాల మేరకే ఎయిమ్స్ను పరిశీలించినట్లు తెలిపారాయన. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్కు పూర్తిగా సహకరిస్తే.. త్వరతగతిన దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్కు భవనాలను అధికారికంగా ఇవ్వాలని కోరారు. ఎయిమ్స్కు రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు కిషన్రెడ్డి.