పందులతో పందేలు.. వేల రూపాయల్లో బెట్టింగులు

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు కోళ్ల పందేలు లేదా పొట్టేళ్ల పందేలు చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా నారాయణ పేట జిల్లాలో పందులతో పందేలు కాస్తున్నారు

Update: 2021-01-03 12:24 GMT

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు కోళ్ల పందేలు లేదా పొట్టేళ్ల పందేలు చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా నారాయణ పేట జిల్లాలో పందులతో పందేలు కాస్తున్నారు. ఈ పోటీల్లో వేల రూపాయలు చేతులు మారుతున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం కాట్రేవపల్లి గ్రామ శివారులో పందులతో జోరుగా పందేలు జరుగుతున్నాయి. పట్టపగలే వేల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చి ఇక్కడ పందేలు కాస్తున్నారు.

Tags:    

Similar News