గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు.. జీహెచ్ఎంసీ అధికారుల్ని ఆదేశించారు. నగరంలో బస్టాప్లను ఒకే తరహాలో నిర్మించాలని చెప్పారు. పార్కులు, బస్బేల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాల్ని గుర్తించాలని దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్లు ప్రజంటేషన్ ఇచ్చారు.