Harish Rao : మంత్రి హరీష్ రావు పర్యటనలో ఉద్రిక్తత..

Harish Rao : సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌ రావు పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది

Update: 2022-10-07 12:00 GMT

Harish Rao : సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌ రావు పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది. అక్బర్‌పేట- భూంపల్లిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. డీసీసీబీ బ్యాంక్‌ ప్రారంభోత్సానికి మంత్రి హరీష్‌,ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు వచ్చారు. అయితే.. బ్యాంక్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫోటో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ కార్యకర్తలు. ఫ్లెక్సీలో రఘునందన్‌రావు ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దీంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది..

Tags:    

Similar News