గ్రేటర్ హైదరాబాద్ లో GHMC అధికారులు అలర్ట్ అయ్యారు.. మరోసారి భారీ వర్ష సూచనలు ఉండడంతో ప్రజలనుసైతం అప్రమత్తం చేస్తున్నారు. ముషీరాబాద్ లో ముందస్తు చర్యలను ముమ్మరం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు.. రాగల 48 గంటల్లో భారీ సూచన నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్యకుంట, అరుంధతి నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. GHMC అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెల్టర్స్ లోకి ముంపు బాధితులను తరలిస్తున్నారు.