యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథసప్తమి ప్రత్యేక పూజలు..!
రథసప్తమి పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సుప్రభాత సేవతో ఉదయాన్నే స్వామివారి దర్శనాలు మొదలయ్యాయి.;
రథసప్తమి పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సుప్రభాత సేవతో ఉదయాన్నే స్వామివారి దర్శనాలు మొదలయ్యాయి. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీ దేవ్ సింగ్ కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.