పాదయాత్రలకు సిద్ధమైన రేవంత్, బండి సంజయ్.. !
తెలంగాణలో పట్టుకోసం రాజకీయ పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు.;
తెలంగాణలో పట్టుకోసం రాజకీయ పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పాదయాత్రపై బండి సంజయ్ క్లారిటీ ఇవ్వగా.. తాజాగా టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సై అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ఒకరు పార్టీకి పునర్జీవం పోయాలని చూస్తుంటే.. మరొకరు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని భలోపేతం చేయాలని ప్లాన్ వేస్తున్నారు. మరి పాదయాత్ర ఎవరికి కలిసి వస్తుంది.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎవరు మారబోతున్నారు? అన్నది వేచి చూడాల్సిందే.!