REVANTH: సాఫ్ట్‌వేర్ కోర్సులతోనే ఉద్యోగాలు రావు

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం... విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు అవసరం.. యువత స్కిల్స్ పెంచేందుకు టాటాతో చర్చలు: సీఎం

Update: 2025-09-28 03:30 GMT

2034 నా­టి­కి తె­లం­గాణ 1 ట్రి­లి­య­న్‌ డా­ల­ర్‌ ఎకా­న­మీ­గా.. 2047 నా­టి­కి 3 ట్రి­లి­య­న్‌ డా­ల­ర్‌ ఆర్థిక వ్య­వ­స్థ­గా ఎద­గా­ల­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. మల్లె­ప­ల్లి ఐటీఐ ప్రాం­గ­ణం­లో అడ్వా­న్స్‌­డ్ టె­క్నా­ల­జీ సెం­ట­ర్ (ఏటీ­సీ)ను అలా­గే అలా­గే రా­ష్ట్రం­లో­ని 65 ఏటీ­సీ­ల­ను వర్చు­వ­ల్​ సీఎం రే­వం­త్ రె­డ్డి ప్రా­రం­భిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా సీఎం మా­ట్లా­డు­తూ.. తె­లం­గాణ పు­న­ర్ ని­ర్మా­ణం­లో యువత భా­గ­స్వా­మ్యం కా­వా­ల­న్నా­రు. ఐటీ­ఐ­ల­ను ఉమ్మ­డి రా­ష్ట్రం­లో మొ­ట్ట­మొ­ద­టి సా­రి­గా 1956లో ప్రా­రం­భిం­చా­ర­న్నా­రు. మా­రు­తు­న్న కా­లా­ని­కి అను­గు­ణం­గా సాం­కే­తిక నై­పు­ణ్యా­న్ని అం­దిం­చా­ల­న్న ఆలో­చన గత ప్ర­భు­త్వా­లు చే­య­లే­ద­ని, కో­ర్సు­ల­ను అప్ గ్రే­డ్ చే­య­క­పో­వ­డం­తో కా­ల­క్ర­మే­నా ఐటీ­ఐ­లు ని­ర్వీ­ర్య­మ­య్యా­య­న్నా­రు. వి­ద్యా­ర్థు­ల­కు చదు­వు­తో పాటు నై­పు­ణ్యా­లు అవ­స­ర­మ­ని భా­విం­చా­మ­న్నా­రు. యు­వ­త­లో స్కి­ల్స్‌ పెం­చ­డం కోసం టాటా టె­క్నా­ల­జీ­స్‌­తో చర్చ­లు జరి­పి­న­ట్లు తె­లి­పా­రు. వారి సహ­కా­రం­తో ఐటీ­ఐ­ల­ను ఏటీ­సీ­లు­గా అభి­వృ­ద్ధి చే­సి­న­ట్లు వి­వ­రిం­చా­రు. నైపుణ్యం లేకుండా ఇంజినీరింగ్ పట్టా ఉన్నా ఏమాత్రం ఉపయోగం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్ యువతను పట్టించుకోకుండా గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. యువతలో నైపుణ్యం ఉంటే దేశాలన్నీ మన మందు మోకరిల్లుతాయని కామెంట్ చేశారు.


విద్యార్థులకు ప్రతి నెలా రూ.2 వేలు

నేటి యు­గం­లో ఉద్యో­గం కా­వా­లం­టే నై­పు­ణ్యం తప్ప­ని­స­రి అని రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. తల­రా­త­లు మా­ర­లం­టే చదు­వు ఒక్క­టే మా­ర్గ­మ­ని.. అద­రి­కీ ప్ర­భు­త్వం సహ­క­రి­స్తుం­ద­ని అన్నా­రు. రా­ష్ట్రం­లో ఉద్యో­గా­వ­కా­శా­లు ఉన్నా.. యు­వ­త­లో నై­పు­ణ్యం లే­ద­ని వి­ష­యం తమ దృ­ష్టి వచ్చిం­ద­ని అన్నా­రు. హై­ద­రా­బా­ద్ వచ్చాక చదు­వు­తో పాటు వి­ద్యా­ర్థు­ల­కు సాం­కే­తిక నై­పు­ణ్యం అం­దిం­చా­ల­నే లక్ష్యం­తో రా­ష్ట్రం­లో అడ్వా­న్స్‌­డ్ టె­క్నా­ల­జీ సెం­ట­ర్ల­ను ఏర్పా­టు ఆలో­చన చే­శా­మ­ని అన్నా­రు. మం­త్రి­వ­ర్గ భే­టీ­లో చర్చిం­చి ఐటఐ­ల­ను అడ్వా­న్స్‌­డ్ ట్రై­నిం­గ్ సెం­ట­ర­లు­గా మా­ర్చా­మ­ని పే­ర్కొ­న్నా­రు. ప్ర­భు­త్వం నుం­చి రూ­పా­యి ఖర్చు లే­కుం­డా మొ­త్తం టాటా సం­స్థ­నే భరిం­చిం­ద­ని అన్నా­రు. ట్రై­నిం­గ్ సెం­ట­ర్ల­లో శి­క్షణ పొం­దిన 90 శాతం మం­ది­కి ఉద్యో­గా­లు వస్తు­న్నా­య­ని అన్నా­రు. త్వ­ర­లో మరో 53 ఏటీ­సీ­ల­ను పె­డు­తు­న్నా­య­ని స్ప­ష్టం చే­శా­రు. స్కి­లు లే­క­పో­వ­డం­తో యు­వ­త­కు ఉద్యో­గా­లు రాక చెడు వ్య­స­నా­ల­కు బా­ని­న­లు అవు­తు­న్నా­ర­ని, గం­జా­యి కే­సు­లు పె­రు­గు­తు­న్నా­య­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అన్నా­రు. గం­జాయ అల­వా­టు నుం­చి అమ్మ­కం­దా­రు­లు­గా మా­రు­తు­న్నా­ర­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News