Siraj: డీఎస్పీగా సిరాజ్

కివీస్ సిరీస్‌కు ముందే గుడ్‌న్యూస్;

Update: 2024-10-12 05:30 GMT

భారత జట్టు క్రికెటర్, హైదరాబాదీ మహ్మద్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ)గా నియామకపత్రం స్వీకరించారు. ఈ మేరకు శుక్రవారం డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ను కలిసి రిపోర్ట్‌ చేశారు. సాధారణ కుటుంబానికి చెందిన సిరాజ్‌ కష్టపడి భారత క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించి నగరానికి ఖ్యాతి తెచ్చిపెట్టారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరాజ్‌కు గ్రూప్‌-1 అధికారిగా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో సిరాజ్‌ నియామకపత్రం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మహేశ్‌ భగవత్, రమేశ్, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

డీఎస్పీ సిరాజ్  

డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. సిరాజ్ ప్రపంచ ఛాంపియన్‌ అయిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ హామీని నెరవేర్చిన ప్రభుత్వం ఇప్పుడు సిరాజ్‌కు ఈ కీలక పదవిని కట్టబెట్టింది. అయితే, సిరాజ్ ఉద్యోగం అతని క్రికెట్‌పై ప్రభావం చూపదు. అతను టీమిండియా కోసం క్రికెట్ ఆడుతూనే ఉంటాడు.

 ఇంటి స్థలం కూడా..

సిరాజ్‌కు ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కూడా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మీడియా కథనాల ప్రకారం, హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకోవడానికి భూమిని కూడా అందించింది. టీమిండియాలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఏకైక ఆటగాడి సిరాజ్ నిలిచిన సంగతి తెలిసిందే.

అక్టోబర్ 16 నుంచి రంగంలోకి

టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్.. ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆడబోతున్నాడు. అక్టోబర్ 16 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్ తర్వాత, సిరాజ్ టెస్ట్ టీమ్ ఇండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనున్నాడు. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాలో భారత్ తన తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది

Tags:    

Similar News