సోషల్‌ మీడియా అరాచకాలకు చెక్‌ పెట్టనున్న సైబరాబాద్‌ పోలీసులు

Update: 2020-11-05 13:20 GMT

సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న అరాచకాలకు చెక్‌ పెట్టనున్నారు సైబరాబాద్‌ పోలీసులు. ఇందుకు అనుగుణంగా గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఓ ఇన్స్‌పెక్టర్‌ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సీపీ సజ్జనార్‌ ఈ విభాగాన్ని ప్రారంభించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న వేధింపులు , సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనల వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు.

Tags:    

Similar News