Tarun Chugh: తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు.. ఫొటో ఎగ్జిబిషన్‌లో అవన్నీ ప్రదర్శిస్తామంటూ..

Tarun Chugh: మోదీ సభ.. చారిత్రక బహిరంగ సభ కాబోతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.

Update: 2022-07-01 14:30 GMT

Tarun Chugh: ప్రధాని మోదీ సభ.. చారిత్రక బహిరంగ సభ కాబోతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. హైదరాబాద్‌.. బీజేపీ విజయయాత్రకు శుభారంభం అవుతుందని తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర, HICCలో ఫొటో ఎగ్జిబిషన్‌పై వివరణ ఇచ్చారు.

నిజాం హయాంలో జరిగిన అత్యాచారాలు, సజీవదహనాలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తామన్నారు. వీటితో పాటు కేసీఆర్ సర్కారు ఎప్పుడు ముగుస్తుందో తెలుపుతూ ఎగ్జిబిషన్‌లో కౌంట్‌డౌన్ ఏర్పాటు చేశామన్నారు. 520 రోజుల తర్వాత తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన నుండి ప్రజలకు విముక్తి లభిస్తుందని తరుణ్ చుక్ స్పష్టంచేశారు. 

Tags:    

Similar News