DAVOS: తెలంగాణకు రూ. 19,500 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌లో ‘స్విస్ మాల్’!

Update: 2026-01-22 04:30 GMT

ప్రపంచ ఆర్థిక రంగానికి దిశానిర్దేశం చేసే వేదికగా గుర్తింపు పొందిన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది.ఈ అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పాల్గొని, భారీ స్థాయి పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకోవడంలో తెలంగాణ విజయం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం అంతర్జాతీయ కంపెనీలతో జరిపిన వరుస చర్చల ఫలితంగా సుమారు రూ.19,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు అధికారికంగా వెల్లడైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. అందులో ప్రధానంగా రష్మి గ్రూప్ రాష్ట్రంలో రూ.12,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఉక్కు, మౌలిక సదుపాయాలు, అనుబంధ రంగాల్లో ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు సమాచారం. దీని ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే క్రమంలో సర్గడ్ కంపెనీ కూడా తెలంగాణలో కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ఒప్పందం కుదిరింది.

ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కూడా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దావోస్ సదస్సులో భాగంగా సోలార్ ప్రొడక్ట్స్ తయారీకి సంబంధించిన ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో రూ.6,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పెట్టుబడులు పునరుత్పాదక శక్తి రంగంలో తెలంగాణను మరింత బలపరచనున్నాయని, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రాష్ట్రాన్ని నిలబెట్టే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణహితమైన వృద్ధికి ఇది దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

హైదరాబాద్‌కు ‘స్విస్ మా

సీఎం రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్‌లోని వాడ్ కాంటన్ సీఎం క్రిస్టెల్ లూసియర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సీఎం ముందుంచారు. దీనికి వాడ్ కాంటన్ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఫలితంగా ప్రపంచంలోనే మొట్టమొదటి స్విస్ మాల్ హైదరాబాద్‌లో ఏర్పాటుకానుందన్న ప్రకటనకు బాట పడింది.

ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ జీసీసీ

ప్ర­పం­చం­లో తొలి బ్యూ­టీ టెక్ గ్లో­బ­ల్ కె­పా­బి­లి­టీ సెం­ట­ర్-GCC హై­ద­రా­బా­ద్‌­లో ఏర్పా­టు కా­నుం­ది. ఈ మే­ర­కు లో­రి­య­ల్ సం­స్థ ఆ వి­ష­యా­న్ని ప్ర­క­టిం­చిం­ది. దా­వో­స్‌­లో వర­ల్డ్ ఎక­న­మి­క్ ఫో­ర­మ్-2026 సద­స్సు­లో సీఎం రే­వం­త్‌­రె­డ్డి లో­రి­య­ల్ సీ­ఈ­వో ని­కో­ల­స్ హి­యో­రో­ని­మ­స్‌­తో భేటీ తర్వాత ఆ కం­పె­నీ ప్ర­క­టన చే­సిం­ది. ప్ర­పం­చం­లో­నే తొలి బ్యూ­టీ- టెక్ గ్లో­బ­ల్ కె­పా­బి­లి­టీ సెం­ట­ర్ హై­ద­రా­బా­ద్‌­లో ఏర్పా­టు కా­నుం­ది. ప్ర­స్తు­తం దా­వో­స్‌­లో వర­ల్డ్ ఎక­న­మి­క్ ఫో­ర­మ్-2026 సద­స్సు­లో లో­రి­య­ల్సం­స్థ ప్ర­క­టిం­చిం­ది. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి­తో లో­రి­య­ల్ సీ­ఈ­వో ని­కో­ల­స్ హి­యో­రో­ని­మ­స్ తో సమా­వే­శ­మ­య్యా­రు. ఈ సం­ద­ర్భం­గా ఆ సం­స్థ ప్ర­క­టన చే­సిం­ది. హై­ద­రా­బా­ద్‌­లో భారీ పె­ట్టు­బ­డు­ల­తో బ్యూ­టీ–టెక్ జీ­సీ­సీ ఏర్పా­టు చేసే ని­ర్ణ­యా­న్ని వె­ల్ల­డిం­చిం­ది. జీ­సీ­సీ ఏర్పా­టు­తో లో­రి­య­ల్‌­కు గ్లో­బ­ల్ ఇన్నో­వే­ష­న్, టె­క్నా­ల­జీ, డేటా, సప్లై చైన్ కా­ర్య­క­లా­పా­ల­కు హై­ద­రా­బా­ద్ కీలక కేం­ద్రం­గా మా­ర­నుం­ది. డి­జి­ట­ల్ ట్రా­న్స్‌­ఫ­ర్మే­ష­న్, ఏఐ, అన­లి­టి­క్స్ రం­గా­ల్లో సాం­కే­తిక పరి­ష్కా­రా­ల­ను ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా ఉన్న లో­రి­య­ల్ యూ­ని­ట్ల­కు అం­ది­స్తా­మ­ని ఆ కం­పె­నీ సీ­ఈ­వో తె­లి­పా­రు.నవం­బ­ర్‌­లో జీ­సీ­సీ ప్రా­రం­భో­త్స­వా­ని­కి సీఎం రే­వం­త్ రె­డ్డి, మం­త్రి శ్రీ­ధ­ర్‌­బా­బు లను ఆ సం­స్థ ఆహ్వా­నిం­చిం­ది. లో­రి­య­ల్ జీ­సీ­సీ­ని హై­ద­రా­బా­ద్‌­కు తీ­సు­కు­రా­వా­ల­న్న ఆలో­చ­న­పై ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి ప్ర­త్యేక ఆస­క్తి చూ­పా­ర­ని, ప్ర­భు­త్వం వైపు నుం­చి పూ­ర్తి సహ­కా­రం అం­ది­స్తుం­ద­ని చె­ప్పా­రు.

Tags:    

Similar News