REVANTH: ప్రజల్లో ఉన్నవారికే జిల్లా అధ్యక్ష పదవులు

టీపీసీసీకి సూచించిన రేవంత్‌రెడ్డి.... పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు దక్కాలన్న సీఎం;

Update: 2024-09-23 03:00 GMT

ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని టీపీసీసీకి సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు దక్కాలన్నారు. ఇప్పటివరకూ 36 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని... పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసినందుకే వారికి పదవులు ఇచ్చామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత్తన సీఎల్పీ సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని.. లోక్ సభ సీట్లు గెలిచామని గుర్తు చేశారు. మహేష్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతు సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేస్తోందని రేవంత్ తెలిపారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు.

మోదీని ఓడించడం చారిత్రక అవసరం

ప్రధాని మోదీని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉన్న సమయంలో పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ బాధ్యత చేపట్టారని రేవంత్‌ అన్నారు. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన… రాహుల్ ఆలోచన మేరకు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాం.. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందే.. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం.. సుప్రీం కోర్టు తీర్పు ను పూర్తిగా అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.. దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోడీ ప్రయత్నాలు చేస్తున్నాడు..

జమిలీ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని రేవంత్‌ సూచించారు. తొమ్మిది నెలల్లో ఒక్క రోజు కూడా నేను సెలవు తీసుకోలేదని..… ప్రభుత్వం చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 27 రోజుల్లో 18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదన్నారు. రైతు రుణ విముక్తి కావడమే ప్రభుత్వ లక్ష్యం… ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నం.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తాం… రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తాం… అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోంది.. ఇంచార్జ్ మంత్రులు వారానికి రెండు సార్లు జిల్లాల్లో పర్యటించాలి… పార్టీలో కష్టపడి పనిచేసే వారికి కచ్చితంగా అవకాశాలు వస్తాయని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News