Minister KTR : తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యం : మంత్రి కేటీఆర్
Minister KTR : బీజేపీ నేతలు కొందరు మతవిద్వేషాలను రెచ్చగొడున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Minister KTR : బీజేపీ నేతలు కొందరు మతవిద్వేషాలను రెచ్చగొడున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఆయన.. తెలంగాణపై కేంద్రం, ప్రధాని మోదీ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
సమైక్యరాష్ట్రంలో కరెంటు, సాగు, తాగు నీటి కోసం ఆందోళనలు జరిగాయన్నారు. బాన్సువాడలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్స్ నిర్మించామని తెలిపారు. ప్రధాని మోదీకి మరోసారి అవకాశం ఇస్తే ఏపీ, తెలంగాణను కలిపేస్తారని విమర్శించారు.
రైతుబంధు ఆలోచన ఏ నాయకునికి రాలేదన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు.