TS: హాస్టళ్లపై తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం
బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్ అధికారులు నిద్ర చేయాలని ఆదేశం..;
సంక్షేమ హాస్టళ్లపై విమర్శలు వస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత నిధులు వెచ్చిస్తున్న పరిస్థితిలో మార్పు రాకపోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతను అడిషనల్ కలెక్టర్లకు ఇచ్చింది ప్రభుత్వం. గర్ల్స్ హాస్టల్స్లో మహిళా ఐఏఎస్ అధికారులు బస చేయాలని ఆదేశించింది. హాస్టల్ నిర్వహణ అధ్వాన్నంగా మారడానికి కారణమేంటి... అక్కడ ఉన్న సమస్యలు ఏంటీ... వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. హాస్టళ్ల గదులు, మౌలిక వసతులు సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించింది. బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్ అధికారులు నిద్ర చేయాలని ఆదేశించింది. అలాగే వసతులపై నివేదిక ఇవ్వాలని సూచించింది.
కీలక ఆదేశాలు...
అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతను అడిషనల్ కలెక్టర్లకు ఇచ్చింది ప్రభుత్వం. గర్ల్స్ హాస్టల్స్లో మహిళా ఐఏఎస్ అధికారులు బస చేయాలని ఆదేశించింది. హాస్టల్ నిర్వహణ అధ్వాన్నంగా మారడానికి కారణమేంటి... అక్కడ ఉన్న సమస్యలు ఏంటీ... వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోనుంది .
హరీశ్ విమర్శలు
ప్రభుత్వ హాస్టళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు, చేసే పనుల్లో పొంతన లేకుండా పోతోందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో మంగళవారం విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. వారికి దుప్పట్లు, టీ షర్ట్స్ అందజేసి, కేక్ కట్ చేసి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పారని, కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అంతా ఉత్తదేనని అర్థం అవుతుందన్నారు.