కరోనా పరిస్థితుల పైన హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వ నివేదిక..!
రాష్ట్రంలోని కరోనా పరిస్థితుల పైన హైకోర్టు నివేదికను సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం..;
రాష్ట్రంలోని కరోనా పరిస్థితుల పైన హైకోర్టు నివేదికను సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం.. ఇందులో కొవిడ్ పరీక్షలు, కట్టడికి చేపడుతున్న చర్యల గురించి నివేదికలో పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
* రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 25 వరకు మొత్తం 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించాం. ఇందులో 4.39 లక్షల RTPCR, 19.16లక్షల ర్యాపిడ్ పరీక్షలు ఉన్నాయి.
* ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి చెందారు.
* రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 3.5 శాతంగా ఉంది.
* కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నాం.
* కరోనాపై నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి.
* కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మద్యం దుకాణాలు, పబ్లు నిబంధనలు పాటించేలా చర్యలు. మద్యం దుకాణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు.
* రాష్ట్రానికి 430 టన్నుల ఆక్సిజన్ను కేంద్రం కేటాయించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ను చేరవేస్తున్నాం.
* రెమ్డెసివర్ పర్యవేక్షణ నోడల్ అధికారిగా ప్రీతిమీనాను నియమించామని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.