Telangana Government : తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

Telangana Government : తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది.

Update: 2022-02-07 11:33 GMT

Telangana Government : తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పుఇచ్చింది. దీంతో వేల కోట్ల విలువచేసే భూములు ప్రభుత్వానికి దక్కాయి. 2016 నుంచి జాగీర్ భూముల కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో 1654 ఎకరాలపై ప్రభుత్వానికి సర్వ హక్కులు వచ్చాయి. 1654 ఎకరాలు తమవే అంటూ వక్ఫ్ బోర్డు, వక్ఫ్‌ ట్రిబ్యునల్ మద్దతుతో.. మణికొండ దర్గా కమిటి సుప్రీంకోర్టుకు ఎక్కింది. గతంలో వక్ఫ్‌ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు.. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ సర్కార్‌కు పెద్ద ఊరట దక్కింది.

Tags:    

Similar News