హడావుడిగా విచారణ అవసరమా?: హైకోర్టు

దేవరయాంజల్ భూముల విషయంలో హైకోర్టు విచారణ జరిపింది. కరోనా టైంలో ఇంత హడావుడిగా విచారణ అవసరమా? అని సర్కారును హైకోర్టు ప్రశ్నించింది.

Update: 2021-05-08 08:00 GMT

దేవరయాంజల్ భూముల విషయంలో హైకోర్టు విచారణ జరిపింది. కరోనా టైంలో ఇంత హడావుడిగా విచారణ అవసరమా? అని సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన ఈ అంశంపై ఎందుకు అని ప్రశ్నించింది. 4 జిల్లాల కలెక్టర్లతో విచారణ చేస్తున్నారని, వాళ్లు పరిపాలనా పనులు వదిలేసి ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టారని వ్యాఖ్యానించింది. మిగిలిన ఆలయ భూముల విషయమేంటని నిలదీసింది. కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ వేశామని ఏజీ కోర్టుకు వివరణ ఇచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని దేవదాయశాఖను కోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News