ఈ రోజు రాత్రి 8 గంటలకు ఎంసెట్ కీ ..

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి.

Update: 2023-05-15 04:23 GMT

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. మూడు రోజులు జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని సోమవారం రాత్రి 8 గంటలకు విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ కార్యాలయం ప్రకటించింది.

విద్యార్థుల రెస్పాన్స్ పత్రాలను కూడా వెబ్ సైట్లో ఉంచుతామని ప్రాథమిక కీపై అభ్యర్థనలను 17వ తేదీ రాత్రి 8 గంటలకు వెబ్ సైట్ లోని లింక్ ద్వారా పంపవచ్చని పేర్కొంది. మొత్తం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 94.11 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. 2,05,351 మందికి 1,95,275 మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది పరీక్షకు హాజరయ్యారు.

Tags:    

Similar News